తెలంగాణలో కొత్తగా 3052 కేసులు

తెలంగాణలో కొత్తగా 3052 కేసులు

రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 24గంటల్లో కొత్తగా 3వేల 52 మందికి వైరస్ సోకగా...ఏడుగురు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1772 కు చేరింది. కరోనా నుంచి నిన్న 778 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24వేల 131 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది ప్రభుత్వం. వీరిలో 16 వేల 118 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారని చెప్పింది. GHMC పరిధిలో అత్యధికంగా 406 ,మేడ్చల్ మల్కాజ్ గిరిలో 301, నిజామాబాద్ లో 279 కేసులు నమోదయ్యాయి.