ఉప్పల్​లో కోహ్లీ మేనియా

ఉప్పల్​లో కోహ్లీ మేనియా

భాగ్యనగర క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌ మ్యాచ్‌లను మస్తు ఎంజాయ్‌ చేస్తున్నారు. మూడో మ్యాచ్‌కు ఫ్యాన్స్‌ పోటెత్తారు. ఉప్పల్‌ స్టేడియంలో గురువారం సన్‌ రైజర్స్ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు 35,806 మంది హాజరయ్యారు. సన్‌ రైజర్స్‌ ఓటమి కొంత నిరాశ పరిచినా.. టీమిండియా, ఆర్‌‌సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి అభిమానులు పట్టం కట్టారు. టాస్‌ కు ముందే స్టేడియం మొత్తం నిండిపోగా..

ఆరంభం నుంచే ఫ్యాన్స్ కోహ్లీ.. కోహ్లీ.. ఆర్‌‌సీబీ, ఆర్‌‌సీబీ అంటూ కేరింతలు కొట్టారు. వారిని ఉత్సాహపరిచేలా విరాట్ ఫిఫ్టీతో మెరిశాడు. టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్‌, అల్లు శిరీష్,  డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, మ్యూజిక్‌ డైరెక్టర్ తమన్‌, ఎంపీ అనిల్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిష తదితర సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.