హైదరాబాద్, వెలుగు: ఫ్రాన్స్కు చెందిన టైర్ టెక్నాలజీ సంస్థ మిచెలిన్ హైదరాబాద్లో సోమవారం నాలుగు టైర్స్ అండ్ సర్వీసెస్ కేంద్రాలను ప్రారంభించింది. జూబ్లీహిల్స్, సరూర్నగర్, గండిమైసమ్మ, కొంపల్లి ప్రాంతాలలో ఇవి ఏర్పాటయ్యాయి. మనదేశంలోనే తయారైన ప్రైమసీ 5 ప్యాసింజర్ వెహికల్ టైర్లను వీటిలో కొనుక్కోవచ్చు.
ప్రపంచ స్థాయి రిటైల్ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని తయారు చేశామని కంపెనీ తెలిపింది. ప్రత్యేక సర్వీస్ బేలు, ఆధునిక పరికరాలు, కస్టమర్ల విశ్రాంతి గదులు ఈ కేంద్రాల్లో ఉంటాయి. లగ్జరీ వాహనాలకు డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేశామని మిచెలిన్ పేర్కొంది.
