![కాంగ్రెస్ పార్టీలో చేరికలు: అనిరుధ్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2023/10/40-Manne-Jeevan-Reddy-Yuvasena-members-from-Kollur-village-joined-the-Congress_lY0p1RajNz.jpg)
నవాబుపేట, వెలుగు: మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన 40 మంది మన్నె జీవన్ రెడ్డి యువసేన సభ్యులు శనివారం కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నేత జనంపల్లి అనిరుధ్ రెడ్డి నివాసంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందన్నారు.
అధికారంలోకి రాగానే కొల్లూరును మండలంగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. సున్నాల కృష్ణ, తులసీరాం నాయక్, వాసు యాదవ్, ఖాజా మొయినుద్దీన్ పాల్గొన్నారు.