
మాస్కో: రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దాడికి ఉక్రెయిన్ రివేంజ్ తీర్చుకుంది. ఆదివారం (జూన్ 1) రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ డ్రోన్ ఎటాక్ చేసింది. ఉక్రెయిన్ దాడుల్లో మాస్కోకు భారీ నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కీవ్ చేసిన డ్రోన్ దాడుల్లో రష్యకు చెందిన 40 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ మీడియా నివేదించింది.
సరిహద్దు నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు సైబీరియాలోని పలు సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడిందని తెలిపింది. ఇర్కుట్స్క్ ప్రాంత రష్యన్ గవర్నర్ ఈ దాడిని ధృవీకరించారు. శ్రీద్ని గ్రామంలోని సైనిక యూనిట్పై కీవ్ ఎటాక్ చేసిందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ సైబీరియాలోని ఒలెన్యా, బెలయాలోని వైమానిక స్థావరాలతో సహా నాలుగు రష్యన్ సైనిక వైమానిక స్థావరాపై ఏకకాలంలో దాడులు చేసింది. ఈ దాడిలో Tu-95, Tu-22M3 బాంబర్లు, ఒక A-50 విమానం ఉందని కీవ్ మీడియా పేర్కొంది.
ALSO READ | అమెరికా ప్రతిపాదనకు హమాస్ ఓకే.. పది మంది బందీలను, విడుదల చేస్తామని ప్రకటన
రష్యా బాంబర్లను నాశనం చేయడమే ఈ దాడి లక్ష్యమని పలు వార్త సంస్థలు నివేదించాయి. ఇప్పటికే వరకు ఈ దాడులను రష్యా ధృవీకరించలేదు. ఒకవేళ మాస్కో ధృవీకరిస్తే.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదే కానుంది. కీవ్ చేసిన ఈ మెరుపు డ్రోన్ ఎటాక్ మాస్కోకు గణనీయమైన ఎదురుదెబ్బ కానుంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోలను భట్టి చూస్తే రష్యాకు భారీ నష్టం వాటిలినట్లు తెలుస్తోంది.