సికింద్రాబాద్, వెలుగు: వచ్చే ఏడాది జనవరి 11, 12, 13 తేదీల్లో సిటీ నుంచి రైళ్లలో ఏపీకి వెళ్లాలంటే టికెట్లు లేవు. సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్రైళ్లన్నీ ఫుల్అయ్యాయి. రిజర్వేషన్ఓపెన్చేసిన నిమిషాల్లో అయిపోయాయి. ప్రస్తుతం వెయిటింగ్లిస్ట్భారీగా పెరిగిపోతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ఏపీకి వెళ్లే రైళ్లలో టికెట్లు బుక్చేసుకుందామంటే ‘నో టికెట్స్’అని వస్తోంది. వెయిటింగ్ లిస్ట్రిగ్రేట్ స్టేటస్చూపిస్తోంది. ఈ నేపథ్యంలో వెయిటింగ్ లిస్ట్ ను తగ్గించేందుకు రెగ్యులర్రైళ్లకు అదనపు కోచ్లు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్లాన్చేస్తున్నారు. అప్పటికీ సరిపోకపోతే 400 స్పెషల్ సర్వీసులు నడపాలని యోచిస్తున్నారు.
సికింద్రాబాద్నుంచి ఏపీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే గరీబ్ రథ్, ఫలక్నుమా, కోణార్క్, ఎల్టీటీ ముంబై, గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్తో సహా అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు విశాఖపట్నం వైపు జనవరి 10, 11, 12 తేదీల్లో పూర్తిస్థాయిలో నిండిపోయాయి. కాకినాడ వైపు వెళ్లే కాకినాడ ఎక్స్ప్రెస్, ఎల్ టీటీ- కాకినాడ ఎక్స్ప్రెస్రైళ్లు రిగ్రేట్స్టేటస్ చూపిస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్ రైళ్లన్నీ ఏపీ మీదుగానే వెళ్తాయి. వీటన్నింటిలో టికెట్లు అయిపోయాయి. రద్దీకి అనుగుణంగా వివిధ మార్గాల్లో 400 స్పెషల్ సర్వీసులు నడపాలని ప్లాన్చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు...
