తెలంగాణలో కొత్తగా 401 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 401 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 39,288 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 401 మంది వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు  రాష్ట్రంలో కేసుల సంఖ్య 7,86,422 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4,109.

రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 5,646 గా ఉండగా..865 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.

 

మరిన్ని వార్తల కోసం...

 

ముగిసిన మేడారం మహాజాతర.. వనంలోకి జన దేవతలు