- అథ్లెట్లకు వరల్డ్ అథ్లెటిక్స్ బంపరాఫర్
మొనాకో: పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ నెగ్గే క్రీడాకారులపై ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురవనుంది. ఒలింపిక్స్లోని 48 అథ్లెటిక్స్ ఈవెంట్లలో గోల్డ్ మెడలిస్టులకు 50 వేల యూఎస్ డాలర్ల (రూ. 41 లక్షలు) నగదు బహుమతి ఇస్తామని వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) బుధవారం ప్రకటించింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో గోల్డ్తో పాటు సిల్వర్, బ్రాంజ్ మెడలిస్టులకు కూడా ప్రైజ్మనీ అందిస్తామని తెలిపింది. దాంతో ఒలింపిక్స్కు ప్రైజ్మనీ ప్రకటించిన తొలి ఇంటర్నేషనల్ ఫెడరేషన్గా డబ్ల్యూఏ నిలిచింది.