
- సోలార్ రూఫ్ టాప్లతో .. తగ్గుతున్న కరెంట్ బిల్లు
- కనీసం నెలకు రూ.1,000 ఆదా చేసుకున్నామన్న గుజరాతీలు
- మిగులు కరెంట్ను గ్రిడ్కు కనెక్ట్ చేసి రూ. 300 కోట్లు సంపాదించారన్న మినిస్టర్
అహ్మదాబాద్: సోలార్ రూఫ్ టాప్లతో కరెంట్ బిల్లు ఆదా అవుతోంది. వీటిని ఎక్కువగా ఇన్స్టాల్ చేసిన రాష్ట్రాల్లో గుజరాత్ టాప్లో ఉంది. సోలార్ రూఫ్ టాప్లను ఇన్స్టాల్ చేసుకున్న 43 శాతం గుజరాతీలు తమ కరెంట్ బిల్లు నెలకు కనీసం రూ. 1,000 తగ్గిందని పేర్కొన్నారు. సూర్య గుజరాత్ స్కీమ్ ప్రభావాన్ని గుజరాత్ ఊర్జ్ వికాస్ నిమ్ లిమిటెడ్తో కలిసి ఎంఎస్ యూనివర్సిటీ విశ్లేషించింది. తాజాగా ఓ రిపోర్ట్ విడుదల చేసింది. ‘43 శాతం మంది రెస్పాండెంట్ల కరెంట్ బిల్లు కనీసం నెలకు రూ. 1,000 తగ్గింది.
సోలార్ రూఫ్ టాప్లను ఇన్స్టాల్ చేసుకున్న కుటుంబాల్లో 95 శాతం మంది ఆదాయం ఏడాదికి రూ.10 లక్షల లోపే ఉంది. డబ్బులు ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతోనే వీరు రెన్యూవబుల్ ఎనర్జీ వైపు చూస్తున్నారు. వ్యాపార వేత్తలు, ఉద్యోగులే సోలార్ రూఫ్ టాప్లను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు’ అని ఈ రిపోర్ట్ వెల్లడించింది. గుజరాత్లో ఒక్కో వ్యక్తి సగటున వాడుతున్న కరెంట్ రెండింతలు పెరిగిందని ఈ రాష్ట్ర ఎనర్జీ అండ్ పెట్రోకెమికల్స్ మినిస్టర్ కను దేశాయ్ పేర్కొన్నారు. జాతీయ సగటు వాడకం 1,255 యూనిట్లు ఉండగా, గుజరాత్లో ఇది 2,283 యూనిట్లుగా ఉందని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ నాటికి రెసిడెన్షియల్ రూఫ్టాప్ల ఇన్స్టలేషన్స్ నుంచి 4,900 మిలియన్ యూనిట్స్ జనరేట్ అయ్యాయని వివరించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఎమిషన్స్ వెలువడకుండా చూసుకున్నామని అన్నారు.
సోలార్ రూఫ్ టాప్లతో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన కరెంట్ బిల్లు ఆదా చేసుకున్నారని, 1,267 మిలియన్ యూనిట్ల మిగులు కరెంట్ను గ్రిడ్లకు పంపడం ద్వారా రూ.300 కోట్లు సంపాదించుకున్నారని దేశయ్ వివరించారు. కాగా, 58,173 మంది రెస్పాండెంట్ల నుంచి అభిప్రాయాలు సేకరించి, రెసిడెంట్లపై సోలార్ రూఫ్ల ప్రభావాన్ని పరిశీలించి ఈ రిపోర్ట్ను ఎంఎస్ యూనివర్సిటీ విడుదల చేసింది. కరెంట్ బిల్లు ఎంత ఆదా చేశారు? సోలార్ రూఫ్లతో సంతృప్తి చెందారా? ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? వంటి అంశాలపై సర్వే చేశారు.