కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 46 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కొన్ని చోట్ల సింగిల్ నామినేషన్లు దాఖలు కాగా మరికొన్ని చోట్ల నామినేషన్లు వేసిన వాళ్లు శనివారం విత్డ్రా చేసుకున్నారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే గాంధారి మండలంలో 18, లింగంపేటలో 14, నాగిరెడ్డిపేటలో 6, ఎల్లారెడ్డిలో 5 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.
అలాగే ఫస్ట్ విడతలో ఎన్నికలు జరిగే సదాశివనగర్లో 3, రాజంపేటలో 2 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గాంధారి మండలంలోని మేడిపల్లి, చెన్నాపూర్, దుర్గం, గొల్లాడి, గుడివేనుక తండా, హేమ్లానాయక్ తండా, కాయిత్తండా, లొంకతండా, నేరల్ తండా, పిస్కిల్గుట్ట తండా, రాంపూర్గడ్డా, సోమారం, మాతుసంగెం, సోమ్లానాయక్ తండా, పర్మల్లతండా, తిప్పారం తండా, లింగంపేట మండలంలో లింగంపల్లిఖుర్ధు, ఒంటర్పల్లి, అయ్యపల్లితండా, బాణాపూర్, బాణాపూర్తండా, మాలోతు సంగ్యానాయక్తండా, మాలోత్తండా, మెంగారం, ముంబాజీపల్లితండా, నల్లమడుగుపెద్ద తండా, రాంపల్లి, రాంపల్లిస్కూల్ తండా, సజ్జనపల్లి, ఎల్లారం ఉన్నాయి.
ఎల్లారెడ్డి మండలంలో అజమాబాద్, హాజిపూర్తండా, సోమర్య్యగాడి తండా, తిమ్మాపూర్, తిమ్మారెడ్డితండా, సదాశివనగర్ మండలంలో సజ్జనాయక్తండా, తిర్మన్పల్లి, తుక్కోజీవాడి, రాజంపేట మండలంలో గుండి తండా, షేర్శంకర్ తండా ఏకగ్రీవమయ్యాయి.
బీర్కూర్ తండా, పిట్లంలో..
బీర్కూర్, పిట్లం: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బీర్కూర్ తండా జీపీ సర్పంచ్ ఎన్నికల్లో కాట్రోత్ దేవిసింగ్ఒక్కడే నామినేషన్ వేశారు. ఎనిమిది వార్డులకు ఒకటి చొప్పున నామినేషన్లు వచ్చాయి. పిట్లం మండలం గౌరారం తండాలో శనివారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం కవిత ఒక్కరే మిగిలారు. రెండు పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది.
