ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్య, నేర చరిత్ర, ఆర్థిక పరమైన అంశాలపై అసోసియేషన్ ఫర్డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్)'తెలంగాణ ఎన్నికల వాచ్’ పేరిట అధ్యయనం చేసింది. ఆ స్టడీ వివరాలను శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ కో–ఆర్డినేటర్లు రాకేశ్ రెడ్డి, రాంప్రాద్ వెల్లడించారు. నేర చరిత్ర ఉన్నవారికి టిక్కెట్లు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ ఆదేశాలను అతిక్రమించి పలు పార్టీలు నేరస్తులకే సీట్లు కేటాయించినట్లు తెలిపారు. అలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో పార్టీలు చెప్పాలని ప్రశ్నించారు. 2018– ఎన్నికల కంటే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు.
అలాగే.. అభ్యర్థుల ఆస్తుల విలువలు కూడా పెరిగినట్లు వారు సమర్పించిన అపిడవిట్లో ఉన్నాయని వివరించారు. అత్యధిక ఆస్తులను ప్రకటించినవారిలో నల్గొండ జిల్లా మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి 458 కోట్లు, బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీల్కుమార్104 కోట్లు, మంచిర్యాల జిల్లా చెన్నూరు అభ్యర్థి గడ్డం వివేకానంద్606 కోట్లు చూపారని వివరించారు. విద్యార్హతకు వస్తే 2290 మంది అభ్యర్థుల్లో పోస్టు గ్రాడ్యుట్స్477, గ్రాడ్యుట్స్392, డాక్టరేట్స్32 మంది ఉండగా.. నిరక్షరాస్యులు 89 మంది ఉన్నట్లు స్టడీ పేర్కొంది.