
- భారత్–పాక్ ఘర్షణపై ట్రంప్సంచలన కామెంట్స్
- ఏ దేశ యుద్ధ విమానాలో చెప్పని అమెరికా ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన భారత్–పాకిస్తాన్ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని గతంలో చెప్పుకొన్న ట్రంప్.. తాజాగా ఈ యుద్ధంలో 5 ఫైటర్ జెట్స్ ధ్వంసమయ్యాయని తాజాగా కామెంట్ చేశారు. వైట్హౌస్లో రిపబ్లికన్ సెనేటర్లకు ఇచ్చిన విందులో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్-పాక్ ఉద్రిక్తతల్లో విమానాలను గాలిలోనే కూల్చేశారని, తన అంచనా ప్రకారం ఐదు ఫైటర్ జెట్లు కూలిపోయి ఉంటాయని చెప్పారు. అయితే, ఏ వైపు ఈ నష్టం జరిగిందనేది ట్రంప్ స్పష్టం చేయలేదు.