న్యూఢిల్లీ: ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్లో 1.41 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇంటర్ గ్లోబ్ దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ ఇండిగోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్కు చెందిన జ్వాలా ముఖి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ 54.3 లక్షల ఇంటర్గ్లో బ్ షేర్లను కోటక్ మహిం ద్రా(ఇంటర్నేషనల్) లిమిటెడ్ నుంచి ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 559 కోట్లు.