రాష్ట్రంలో కొత్తగా 5567 కేసులు.. 23 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 5567 కేసులు.. 23 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య 5 వేలు దాటుతోంది. గడిచిన 24 గంటల్లో 5,567 మందికి పాజిటివ్ వచ్చింది. మరో 23 మంది చనిపోయారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 989, రంగారెడ్డిలో 431, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 421 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో  పాజిటివ్ కేసుల సంఖ్య 3,73,468 కి చేరగా..మరణాల సంఖ్య 1,899కి చేరింది. నిన్న మరో 2251 మంది కోలుకోవడంతో మొత్తం ఇప్పటి వరకు 3,21,788 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 49,781 మంది ఆస్పత్రిలో ఉన్నారు.