డ్రంక్అండ్ డ్రైవ్లో 59 మందికి జైలు

 డ్రంక్అండ్ డ్రైవ్లో 59 మందికి జైలు

కామారెడ్డి, వెలుగు : జిల్లావ్యాప్తంగా డ్రంక్​అండ్ డ్రైవ్ కేసుల్లో 58 మందికి కోర్టులు జైలు శిక్షలు విధించినట్లు ఎస్సీ రాజేశ్​చంద్ర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.  దేవునిపల్లి పోలీస్ స్టేషన్​పరిధిలో పట్టుబడిన 10 మందిలో నలుగురికి 2 రోజుల జైలు,  ఆరుగురికి 1 రోజు జైలు, రూ. వెయ్యి చొప్పున జరిమానా పడిందన్నారు. దోమకొండ పీఎస్​ పరిధిలో  ఒకరికి 2 రోజుల జైలు, రూ. వెయ్యి జరిమానా,  మాచారెడ్డి,  కామారెడ్డి, భిక్కనూరు పోలీస్​ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కరికి ఒక రోజు జైలు, రూ.వెయ్యి జరిమానా విధించారన్నారు.  

కామారెడ్డిలో 14,  రామారెడ్డిలో 1,   దేవునిపల్లి లో 20 మందికి, భిక్కనూరులో 1, దోమకొండలో 6, రాజంపేట, సదాశివనగ్​లో ఒక్కొక్కరు చొప్పున 44 మందికి  రూ. వెయ్యి చొప్పున కోర్టు జరిమానా విధించిందని ఎస్పీ పేర్కొన్నారు.

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్​ కేసులో పట్టుబడిన మహ్మద్​ ఖాన్​కు ఏడు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఆర్మూర్​ సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్​ గురువారం తీర్పు ఇచ్చినట్లు ఆర్మూర్​ ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​ తెలిపారు. డ్రంక్అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం తాగి డీసీఎం నడుపుతున్న నిజామాబాద్ కు  చెందిన మహమూద్ ఖాన్ ను పట్టుకుని కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్​హెచ్​వో తెలిపారు.