- మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీకి బూస్ట్
- ప్రభుత్వ ప్లాన్
న్యూఢిల్లీ: ఆరు కొత్త రంగాలలో లోకల్ మాన్యుఫాక్చరింగ్ పెంచేందుకు రూ. 18 వేల కోట్ల ఇన్సెంటివ్స్(2.2 బిలియన్ డాలర్లు) ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కెమికల్స్, షిప్పింగ్ కంటెయినర్స్, వ్యాక్సిన్స్ తయారీకి అవసరమైన ప్రొడక్టులు వంటివి ఈ ఆరు రంగాలలో ఉన్నట్లు ఇద్దరు ఆఫీసర్లు వెల్లడించారు. లోకల్ మాన్యుఫాక్చరింగ్కు బూస్ట్ ఇచ్చేలా 2020 లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమును ప్రభుత్వం తెచ్చింది. ఈ పీఎల్ఐ స్కీము కోసం రూ. 1.97 లక్షల కోట్లను వెచ్చించనున్నారు. ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల నుంచి డ్రోన్స్ దాకా మొత్తం 14 సెక్టార్లకు పీఎల్ఐ స్కీములను ప్రకటించారు. ఈ సెక్టార్లలో కొన్నింటిలో మంచి ఫలితాలు వస్తుండగా, మరి కొన్నింటిలో మాత్రం ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదు. పీఎల్ఐ స్కీముల కోసం కేటాయించిన మొత్తంలో కొంత మాత్రమే ఇప్పటిదాకా క్లెయిమ్ చేసుకున్నారు. దీంతో మిగిలిపోయిన మొత్తాన్ని కొత్త సెక్టార్లకు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. కొత్త సెక్టార్లను ప్రోత్సహించేందుకు ఆ నిధులను వాడుకోనున్నట్లు గవర్నమెంట్ ఆఫీసర్లు చెబుతున్నారు. కొత్త ఆలోచనను ప్రభుత్వం ఇంకా బయటకి వెల్లడించలేదు. పీఎల్ఐ స్కీము అమలును మానిటర్ చేసే బాధ్యతను కామర్స్ మినిస్ట్రీ కి అప్పచెప్పారు. తాజా ప్రపోజల్స్పై ఆ మినిస్ట్రీకి పంపిన ఈమెయిల్కు బదులు రాలేదు.
టాయ్స్, బైసైకిల్స్రంగాలకు ఊతం....
టాయ్స్, బైసైకిల్స్, లెదర్, ఫుట్వేర్ రంగాలు పైన చెప్పిన ఆరు కొత్త రంగాలలో ఉంటాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ సెక్టార్లన్నీ రూ. 18 వేల కోట్ల ఇన్సెంటివ్స్ను పంచుకుంటాయని వారు పేర్కొంటున్నారు. ఇండియన్ ఎకానమీ ఎదగడానికి పీఎల్ఐ స్కీము సాయపడుతుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. దేశంలో ప్రైవేటు పెట్టుబడులు బాగా తగ్గిపోవడంతో కొత్త జాబ్స్ క్రియేట్ అవడం లేదు. ముఖ్యంగా తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడంలేదు. ఈ నేపథ్యమే పీఎల్ఐ స్కీము తేవడానికి కారణమైంది. మార్చి 2023తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్లో రూ. 2,900 కోట్లను ఇన్సెంటివ్స్గా చెల్లించారు. స్పెషాలిటీ స్టీల్ ప్రొడక్టులు, సోలార్ మాడ్యూల్స్, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ వంటి రంగాలకు కొంత మొత్తంలోనే ఇన్సెంటివ్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో పీఎల్ఐ ఇన్సెంటివ్స్ డిస్బర్స్మెంట్ భారీగా పెరుగుతుందని అంచనా. 2024–25 నాటికి ఈ ఇన్సెంటివ్స్ రూ. 40 వేల కోట్లకు చేరుతాయని గవర్నమెంట్ ఆఫీసర్లు వెల్లడించారు. ప్రభుత్వ విశ్లేషణలో ఈ విషయం తేలిందని వారు పేర్కొన్నారు.