హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్ వేవ్లో దేశవ్యాప్తంగా 645 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరిని కోల్పోయి అనాథలయ్యారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 158 మంది పిల్లలు అనాథలవగా, ఏపీలో 119 మంది, మన రాష్ట్రంలో 23 మంది పిల్లలు పేరెంట్స్ను కోల్పోయారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు సమర్పించిన వివరాలను శనివారం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. ఈ పిల్లలందరికీ పీఎం కేర్స్ నుంచి రూ. 10 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్టు తెలిపింది. ఈ పది లక్షలను కార్పస్ ఫండ్గా జమ చేసి,18 ఏండ్లు వచ్చిన తర్వాత వాళ్లకు ఇవ్వనున్నట్టు పేర్కొంది. అనాథలైన పిల్లలకు విద్య, వైద్యం పూర్తి ఉచితంగా అందజేస్తామని తెలిపింది. కరోనాతో అనాథలైన పిల్లల వివరాలను pmcaresforchildren.in కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని ప్రజలకు సర్కార్ సూచించింది. మన రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్లో వేల మంది చనిపోయారు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. కానీ, రాష్ట్ర సర్కార్ మాత్రం 23 మంది మాత్రమే అనాథలైనట్టు చెబుతోంది. ఇలా అసలు లెక్కను తక్కువ చేసి చూపించడం వల్ల అనాథలైన పిల్లలు, పీఎం కేర్ నిధులకు నోచుకోకుండా పోయే ప్రమాదం ఉంది.
సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. 645 మంది పిల్లలు అనాథలు
- దేశం
- August 1, 2021
లేటెస్ట్
- IPL 2024: వార్నర్, స్టబ్స్ పోరాటం వృధా.. ఢిల్లీపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ
- గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Samantha: సిటాడెల్ కోసం కఠినమైన శిక్షణ తీసుకున్న:సమంత
- Suriya 44 Movie: క్రేజీ కాంబో..కార్తీక్ సుబ్బరాజుతో సూర్య కొత్త సినిమా షురూ
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్
- IPL 2024: ఒక్కడే వారియర్లా: పరాగ్ ఒంటరి పోరాటంతో రాజస్థాన్ భారీ స్కోర్
- ఫస్ట్ టైం.. అదాని పవర్ ప్రాజెక్టుల్లో రిలయన్స్ 26 శాతం వాటా
- గూగుల్లో జాబ్స్ ఈ అర్హతలు ఉన్నవారికే
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ .. విచారణలో గుర్తించిన పోలీసులు!
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- SRH vs MI: ముంబై కెప్టెన్గా రోహిత్.. హార్దిక్ను ఏమన్నాడంటే..?