వర్ని, వెలుగు : వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లావ్యాప్తంగా 670 వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం వర్ని, చందూరు, మోస్రా మండలాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 300 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించారు.. ఎన్ని లారీలు ఉన్నాయి.. ఎన్ని లోడ్లు మిల్లులకు పంపించారు.. అంటూ నిర్వాహకులను ఆరా తీశారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తి వివరాలను రిజిస్ట్రర్లో నమోదు చేయాలని సూచించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించగానే రశీదులు ఇవ్వాలని, ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్లో ఎంట్రీ చేస్తేనే సకాలంలో బిల్లులు అందుతాయన్నారు. గన్నీ బ్యాగులు, గ్రెయిన్ క్యాలీపర్లు, మాయిచ్చర్ మీటర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. లోడింగ్,అన్లోడింగ్లో జాప్యం జరగొద్దన్నారు.
మొక్కజొన్న సాగైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట అడిషనల్కలెక్టర్ కిరణ్కుమార్, సివిల్సప్లై డీఎం శ్రీకాంత్రెడ్డి, సహకార శాఖ అధికారి అంబర్సింగ్, వర్ని ఏఎంసీ చైర్మన్ సురేశ్బాబా, చందూరు మాజీ జడ్పీటీసీ అంబర్సింగ్, తహసీల్దార్ సాయిలు పాల్గొన్నారు
