
ఢాకా: కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించింది. సోమవారం నుంచి 7 రోజులు అమలు చేయనున్నట్లు తెలిపింది. నిత్యావసరాలు, ఎమర్జెన్సీ సర్వీసు లకు ఎటువంటి ఆటంకం ఉండదని మంత్రులు చెప్పారు. లాక్డౌన్ టైమ్లో అన్ని ఆఫీసులు, కోర్టులు మూసేయాలని స్పష్టంచేశారు. ఫ్యాక్టరీలు, మిల్లులు మాత్రం తెరిచే ఉంటాయని చెప్పారు. సేఫ్టీ రూల్స్ పాటిస్తూ షిఫ్ట్ల ప్రకారం కార్మికులు పని చేసుకోవచ్చంది. కాగా, ప్రాన్స్లో శనివారం నుంచి మళ్లీ లాక్డౌన్ అమలుచేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. బెల్జియం, పోలాండ్ దేశాల్లోనూ కరోనా రూల్స్ మరింత కఠినం చేశారు. పోలాండ్ లో శనివారం నుంచి మూడు వారాల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ విధించారు. జర్మనీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.