
- 80 శాతం ఇక్కడే నుంచే
- రాజస్థాన్ భరత్పూర్ నుంచి మరీ ఎక్కువ
- వెల్లడించిన తాజా స్టడీ రిపోర్టు
న్యూఢిల్లీ: సైబర్క్రైమ్స్కు ఝార్ఖండ్లోని జామ్తారా అడ్డా. ఇప్పుడు రాజస్థాన్లో భరత్పూర్ ప్రాంతం దీనికి జిరాక్స్కాపీలా మారింది. భరత్పూర్తో పాటు హర్యానాలోని నూహ్, ఉత్తరప్రదేశ్లోని మథుర నుంచి సైబర్క్రైమ్స్పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరో ఏడు జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇండియాలో జరుగుతున్న సైబర్క్రైమ్స్లో 80 శాతం ఇక్కడి నుంచే జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐఐటీ కాన్పూర్లో ఇన్క్యుబేట్అవుతున్న స్టార్టప్ ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎఫ్సీఆర్ఎఫ్)‘ఈ డీప్ డైవ్ఇంటూ సైబర్క్రైమ్ ట్రెండ్స్ ఇంపాక్టింగ్ ఇండియా’ పేరుతో విడుదల చేసిన రిపోర్టు ద్వారా ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. 18 శాతం నేరాలతో భరత్పూర్ మొదటి స్థానంలో ఉండగా, మిగతా స్థానాల్లో మధుర (12శాతం), నూహ్ (11శాతం), దేవ్గఢ్ (10శాతం), జామ్తారా (9.6శాతం), గురుగ్రామ్ (8.1శాతం), అల్వార్ (5.1శాతం), బొకారో (2.4శాతం), కర్మ తాండ్ (2.4శాతం) గిరిదిహ్ (2.3శాతం) ఉన్నాయి. "మా స్టడీ రిపోర్ట్ భారతదేశంలో సైబర్ నేరాలకు ఎక్కువగా అవకాశం ఉన్న 10 జిల్లాలపై దృష్టి సారించింది. ఈ జిల్లాల్లో సైబర్ నేరాలకు దోహదపడే ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకున్నాం. నేరాలకు అడ్డుకట్టవేయడానికి తగిన ప్లాన్లను రూపొందించడం చాలా అవసరం" అని ఎఫ్సీఆర్ఎఫ్ కో–ఫౌండర్ హర్షవర్ధన్ సింగ్ అన్నారు. ఈ పది జిల్లాలు భారతదేశంలోని టాప్ 10 సైబర్ క్రైమ్ హబ్లుగా మారాయని చెప్పారు. ప్రధాన పట్టణ కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ జిల్లాల్లో నేరాల సంఖ్య ఎక్కువ ఉంది. సైబర్ భద్రతా మౌలిక సదుపాయాలు తక్కువగా ఉండటం, ఆర్థిక సమస్యలు, తక్కువ డిజిటల్ అక్షరాస్యత వల్ల జనం సైబర్ క్రిమినల్స్ చేతుల్లో మోసపోతున్నారని ఆయన వివరించారు.
నేరాలు ఎలా చేస్తారంటే..
సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ టూల్స్, మాల్వేర్లను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నో యువర్ కస్టమర్ (కేవైసీ), వెరిఫికేషన్ ప్రాసెస్ను ఆన్లైన్లో చేసుకోవడం ద్వారా సైబర్క్రిమినల్స్ నకిలీ ఐడీలను, ఇతర కార్డులను సృష్టిస్తున్నారు. దీంతో అధికారులకు ఇలాంటి వారిని గుర్తించడం సవాలుగా మారింది. అంతేకాదు వీళ్లకు బ్లాక్ మార్కెట్లో నకిలీ ఖాతాలు అందుబాటులో ఉంటున్నాయి. అద్దెకు సిమ్ కార్డ్లు దొరుకుతున్నాయి. వీటి సాయంతో నేరాలు చేస్తున్నారు. అందుకే క్రిమినల్స్ను ట్రాక్ చేయడం, ప్రాసిక్యూట్ చేయడం సవాల్గా మారుతోంది. తక్కువ ధరకు దొరికే ఏఐ సైబర్ఎటాక్ టూల్స్తో రెచ్చిపోతున్నారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లను (వీపీఎన్) ఉపయోగిస్తున్న కారణంగా సైబర్ నేరగాళ్ల వివరాలను తెలుసుకోవడం కష్టమవుతోంది. సైబర్ క్రైమ్ సిండికేట్లు నిరుద్యోగులను చేర్చుకొని వారికి సైబర్ నేరాలపై శిక్షణ కూడా ఇస్తున్నాయి.