మంచిర్యాల జిల్లాలో.. 81 టూ వీలర్స్ వాహనాలు వేలం

 మంచిర్యాల జిల్లాలో.. 81 టూ వీలర్స్ వాహనాలు వేలం

నస్పూర్, వెలుగు: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో 81 టూ వీలర్స్​ను వేలం వేస్తున్నట్లు రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. చట్టప్రకారం డాక్యుమెంట్లు చూపించి, వాహనాలను తీసుకెళ్లాలని చెప్పామన్నారు.

6 నెలల నుంచి ఈ వాహనాల కోసం ఎవరూ రానందున గుర్తుతెలియని ప్రాపర్టీగా పరిగణించామని, బెల్లంపల్లి సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో ఉంచిన వెహికల్స్​ను ఈనెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు 87126 56616, 87126 56621ను సంప్రదించాలన్నారు.