
భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య రెండు లక్షలకు పైగా నమోదవుతోంది. అయితే నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కానీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,35,532 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి ఒక్కరోజే 871 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 3,35,939 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 20,04,333 పాజిటివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 13.39శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు భారత్ లో 1,65,04,87,260 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
India reports 2,35,532 new #COVID19 cases, 871 deaths and 3,35,939 recoveries in the last 24 hours
— ANI (@ANI) January 29, 2022
Active case: 20,04,333 (4.91%)
Daily positivity rate: 13.39%
Total Vaccination : 1,65,04,87,260 pic.twitter.com/6X0dxg3LjJ