- ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్
- రూ.2.40 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
- ఏసీపీ శ్రీనివాస్ కుమార్అమీన్పూర్ (పటా
పటాన్ చెరు, వెలుగు: మహారాష్ట్రకు ఎండు గంజాయిని తరలిస్తున్న అంతరాష్ర్ట ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద రూ.2.46 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసున్నారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్లో రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్కుమార్ సోమవారం మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు ఎండు గంజాయిని రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారంతో పటాన్చెరు పోలీసులు, ఎస్ఓటీ టీమ్ తనిఖీలు చేపట్టారు.
ఆదివారం సాయంత్రం పటాన్చెరు సమీపంలోని ముత్తంగి ఓఆర్ఆర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. మహారాష్ర్ట రిజిస్ర్టేషన్నంబర్లు ఉన్న డీసీఎం నుంచి 19 ప్యాకెట్లలోని 92 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సచిన్ గంగారాం చవాన్, మహేశ్ రవీంద్ర వట్కర్, విజయ్ చవాన్ ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో గంజాయిని ఒడిశాలోని పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన జాఫర్వద్ద నుంచి తీసుకుని మహారాష్ర్టలోని సోలాపూర్కు చెందిన అజిత్జంతాప్కు అందించేందుకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పటాన్చెరు పోలీసులు, ఎస్ఓటీ టీమ్ ను ఏసీసీ శ్రీనివాస్కుమార్అభినందించారు. సీఐ వినాయక్రెడ్డి, ఎస్ఐలు అసిఫ్అలీ, మహేశ్వర్రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
