ఒకే రోజు 95,880 రికవరీ..93,337 కేసులు

ఒకే రోజు 95,880 రికవరీ..93,337 కేసులు

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 93,337 కేసులు నమోదవ్వగా1247 మంది చనిపోయారు.వీటితో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,015 కు చేరగా.. మరణాల సంఖ్య 85,619 కు చేరింది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 95,880  మంది రికవరీ అయ్యారు.దీంతో కలిపి దేశంలో 42,08,432 మంది కరోనా నుంచి కోలుకున్నారు.10,13,964 మంది  ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. . దేశంలో రికవరీ రేటు 79.28 శాతం ఉండగా.. కరోనా మరణాల రేటు 1.61 గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది

ఇక నిన్న ఒక్కరోజే 8,81,911 మందికి టెస్టులు చేశారు. దీంతో దేశంలో సెప్టెంబర్ 18 వరకు కరోనా టెస్టుల సంఖ్య6,24,54,254 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.