న్యూఢిల్లీ: హజ్ యాత్ర సందర్భంగా ఈ ఏడాది లో ఇప్పటివరకు 98 మంది ఇండియన్లు మరణించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. పలు ప్రమాదాల్లో నలుగురు మినహా మిగతావారంతా దీర్ఘకాలిక అనారోగ్యాలు, వృద్ధాప్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ఈ ఏడాది ఇప్పటివరకు 1.75 లక్షల మంది మక్కాను సందర్శించినట్లు పేర్కొంది.
రాష్ట్రానికి చెందిన ఆరుగురు మృతి
తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన వారిలో ఆరుగురు మరణించారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్అబ్దుల్రహీమ్ ఆసిఫ్ (55) జమారత్లో గుండెపోటుతో.. సంగారెడ్డికి చెందిన సూరయ్య యస్మీన్ (49), వహీద్ రైసా(50) అధిక ఉష్ణోగ్రతల వల్ల చనిపోయారు. అలాగే.. రంగారెడ్డికి చెందిన మహమ్మద్ తాజుద్దీన్ (69), ఇలియాజ్ మహమ్మద్(61) మక్కాలో హార్ట్ఎటాక్తో మరణించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. సౌదీ అరేబియాలో ప్రస్తుతం 50 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.