స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతిచెందిన ఘటన  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన స్కూల్ బస్సు స్కూటీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బోరంపేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూ్ల్ లో మూడో తరగతి చదువుతున్న చిన్నారి దీక్షిత(8) అక్కడికక్కడే మృతిచెందింది. స్కూటీ వెనకసీటులో కూర్చున్న చిన్నారి దీక్షిత (8) కిందపడిపోడటంతో బస్సు పాపపై  నుంచి వెళ్లడంతో శరీర భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. 


రెడ్డీస్ ల్యాబ్ వద్ద కిషోర్ తన కూతురు దీక్షిత తో స్కూటీపై రోడ్డు దాటుతుండగా.. అతివేగంతో వచ్చిన భాష్యం స్కూల్ బస్సు స్కూటీని ఢీకొట్టింది. దీంతో వెనక కూర్చున్న పాప స్కూటీ పై నుంచి కిందపడటంతో బస్సు పాపపైనుంచి వెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే మృతిచెందింది. బస్సు డ్రైవర్ రహీం నిర్లక్ష్యంగా అతివేగంగా నడపడం వల్లనే పాప మృతి చెందిందని బాచుపల్లి సీఐ తెలిపారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఎస్ ఐ తెలిపారు.