
- తెలంగాణ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామచంద్రరావు
- ఏపీ నుంచి ఏపీ ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ రావత్ ప్రాతినిధ్యం
ఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కేంద్రం తరఫున హోం శాఖ జాయింట్ సెక్రెటరీ (సీఎస్) ఆశిష్ కుమార్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదటి సమావేశం జరుగనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామచంద్రరావు, ఏపీ నుంచి ఏపీ ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ రావత్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు వివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
2014 లో ఏపి రీఆర్గనేజేషన్ యాక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల భౌగోళిక విభజన, ఆస్తులు, ఉద్యోగుల పంపకం ,సాగు నీరు, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వంటి పలు అంశాల గురించి ఈ యాక్ట్లో పొందుపరిచారు. ఏపి, తెలంగాణ విడిపోయిన నాటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య చాలా విషయాల్లో వివాదాలు నెలకొన్నాయి. తమ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
మరిన్ని వార్తల కోసం:
కేసీఆర్ నశం పెడితే మేం జండూబామ్ పెడతాం
ఎవరు మీలో కోటీశ్వరులు.. ఐపీఎల్ వేలానికి వేళాయెరా!