
అమెరికాలో H1 వీసాల పేరుతో తెలుగు విద్యార్థులను నట్టేట ముంచింది ఓ కిలాడీ జంట. అమెరికాలో చదువుకుంటున్న F1 వీసా కలిగి ఉన్న స్టూడెంట్స్ కి H1 వీసా లు ఇప్పిస్తామని ఇద్దరు వ్యక్తులు ముత్యాల సునీల్ , ప్రణీత కోట్లు వసూలు చేశారు. కన్సల్టెంట్ కంపెనీ పేరుతో 30 మంది తెలుగు విద్యార్థుల దగ్గర రూ.10 కోట్ల వరకు వసూళు చేశారు. ఒక్కో విద్యార్థి దగ్గర రూ. 25 వేల డాలర్లు వసూలు చేశారు. 30 మంది తెలుగు విద్యార్థులు అట్లాంటా హోంల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు. ముత్యాల సునీల్ , ప్రణీత పైన ఇంటర్ పోల్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం సునీల్ ,ప్రణీత ఇద్దరు పరారీలో ఉన్నారు. విద్యార్థుల దగ్గర వసూలు చేసిన డబ్బులను సునీల్ తన తండ్రి ముత్యాల సత్యనారాయణ ఎకౌంట్ కు బదిలీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణ కోట్ల రూపాయల ఆస్తులు కూడ పెట్టాడు. సునీల్, ప్రణీత యూరప్ పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సునీల్ తండ్రి సత్యనారాయణ కూడా పరారీలో ఉన్నాడు.
కోవిడ్ సెంటర్లో పీపీఈ కిట్ తో పెళ్లి చేసుకున్న జంట