డెడ్‌బాడీని కొరికిన ఎలుకలు

డెడ్‌బాడీని కొరికిన ఎలుకలు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా హాస్పిటల్‌లోని ఓ వ్యక్తి డెడ్‌బాడీని ఎలుకలు కొరికాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్​ పెంకుల రవి భువనగిరిలోని ప్రగతినగర్​లో నివాసం ఉంటున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా ఆదివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  సమాచారం అందుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

కానీ,  రవి మృతదేహాన్ని సిబ్బంది మార్చురీ ఫ్రీజర్​లో కాకుండా బయటే ఉంచగా..  ఎలుకలు దాడి చేసి ముఖాన్ని కొరికేశాయి.  దీనిపై బంధువులు హాస్పిటల్​ స్టాఫ్ నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం  చేశారు.  అనంతరం  బీజేపీ కౌన్సిలర్​ జనగాం కవిత నర్సింహచారి సాయంతో రవి అంత్యక్రియలు నిర్వహించారు.