- భూ సమస్య పరిష్కరిస్తలేరని ఆత్మహత్యాయత్నం
- గ్రీవెన్స్కు పోతే పీఎస్కు పొమ్మన్నరు
- పీఎస్కు పోతే కొడతమన్నరు
- దవాఖానాకు తరలించిన అడిషనల్ కలెక్టర్
- ఎంక్వైరీకి ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పోలీసుల అండతో తన భూమిని తన అన్న గుంజుకున్నాడని, న్యాయం చేయాలని కొత్తగూడెం కలెక్టరేట్ఎదుట ఓ రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులకు కంప్లయింట్ఇస్తే పట్టించుకోవడం లేదని, కలెక్టరేట్కు వస్తే పీఎస్కు వెళ్లి కంప్లయింట్ఇవ్వాలని చెబుతున్నారని వాపోయాడు. బాధితుడి కథనం ప్రకారం...జూలూరుపాడు మండలం కొత్తూరుకు చెందిన గొల్లపూడి శ్రీనివాసరావుకు గ్రామంలో ఆరెకరాల భూమి ఉంది. ఆయన పొలం పక్కనే అతడి అన్న శ్యాంసుందర్కు భూమి ఉంది. ఇందులో బోరు పడకపోవడంతో తమ్ముడికి చెందిన నాలుగెకరాలు ఆక్రమించుకోవాలని ప్లాన్చేశాడు. కొంతమంది దళితులకు ఆ పొలాన్ని సాగు చేసుకోవాలని కౌలుకు ఇచ్చాడు. శ్రీనివాసరావు పొలానికి వస్తే శ్యాంసుందర్అడ్డుకుంటున్నాడు. దీంతో కొన్ని రోజుల కింద జూలూరుపాడు పోలీసులకు కంప్లయింట్ ఇవ్వబోతే స్పందించలేదు. అక్టోబర్10న కొత్తగూడెం కలెక్టరేట్కు వెళ్లి గ్రీవెన్స్లో కంప్లయింట్ చేశాడు. కలెక్టర్ అనుదీప్, అడిషనల్కలెక్టర్ వేంకటేశ్వర్లు ఆయన ఇచ్చిన పేపర్లు చూసి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయని పీఎస్లో కంప్లయింట్ఇవ్వాలని సూచించారు. సోమవారం పీఎస్కు వెళ్లగా ‘నువ్వు ఆ భూమిలోకే వెళ్లొద్దు. అది నీ జాగా కాదు. వెళ్తే నీ సంగతి చూస్తా’ అని పోలీసులు బెదిరించారు. సహనం కోల్పోయిన శ్రీనివాస రావు మళ్లీ కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్కు వెళ్లాడు.
నీకు దమ్ము లేదు..పీఎస్కు పో..
గ్రీవెన్స్లో ఉన్న అడిషనల్ కలెక్టర్ వేంకటేశ్వర్లును శ్రీనివాసరావు కలిసి విషయం చెప్పాడు. పీఎస్కు పోతే బెదిరిస్తున్నాడని వాపోయాడు. దీంతో ఆయన ‘నీకు దమ్ము లేదు. నీకు రైతు బంధు వస్తోంది. ఆధారాలన్నీ ఉన్నాయ్. నువ్వు వెళ్లి పీఎస్లో కంప్లయింట్ఇవ్వు. నీ భూమిలోకి నువ్వు పో’ అన్నాడు. దీంతో కలత చెందిన శ్రీనివాస రావు బయటకు వచ్చాడు. గేట్ముందు నిలబడి ‘పోలీస్స్టేషన్కు వెళ్తే కొడతామంటున్నారు. కలెక్టరేట్కు వస్తే పీఎస్కు పొమ్మంటున్నారు నేనేం చేసేది’ అంటూ తన క్యారీ బ్యాగ్లో నుంచి గ్రీవెన్స్లో ఇచ్చిన రిసిప్ట్ను కింద పడేశాడు. మరో క్యారీ బ్యాగ్ నుంచి పురుగుల మందు డబ్బా తీసి మీద పోసుకున్నాడు. తాగుతుండగా పక్కనున్న వారు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్, డీఆర్ఓ అశోక్ చక్రవర్తి వచ్చి బాధితుడితో మాట్లాడారు. కానిస్టేబుల్ను ఇచ్చి హాస్పిటల్కు పంపించారు. దీనిపై ఎంక్వైరీ చేయాలని ఆదేశించడంతో జూలూరుపాడు తహసీల్దార్ లూథర్ విల్సన్ విచారణ మొదలుపెట్టారు. శ్రీనివాసరావు బాగానే ఉన్నాడని కొత్తగూడెం సర్కారు దవాఖానా డాక్టర్లు చెప్పారు.
సివిల్ మ్యాటర్ అందుకే..
శ్రీనివాస రావు ఇష్యూ సివిల్ మ్యాటర్కావడంతో జోక్యం చేసుకోలేదు. రెవెన్యూ ఆఫీసర్ నుంచి ఆదేశాలొస్తే మేం కేసు పెడతాం. శ్రీనివాసరావును బెదిరించామన్న ఆరోపణల్లో నిజం లేదు.
- శ్రీకాంత్, ఎస్ఐ, జూలూరుపాడు