ప్రయాణమే చేయని ఫ్లైట్​కు టికెట్లమ్మితే.. అరగంటలో ‌‌ఫుల్

ప్రయాణమే చేయని ఫ్లైట్​కు టికెట్లమ్మితే.. అరగంటలో ‌‌ఫుల్

‌‌‌‌‌‌సింగపూర్: కరోనా వల్ల సర్వీసులన్నీ రద్దైనయ్.. ఒకటీ అరా ఫ్లైట్లు నడుస్తున్నా వచ్చే డబ్బు ఆడికాడికే అయిపోతంది. లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో ఎయిర్​లైన్స్​ కంపెనీలన్నీ దాదాపుగా కుదేలయ్యాయి. ఇలాంటి టైమ్​లో సింగపూర్​ ఎయిర్​లైన్స్ సోమవారం టికెట్ల అమ్మకం షురూ జేసింది. ఇట్లా కౌంటర్​ తెరిచిందో లేదో.. అరగంటలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయినయ్. స్పెషల్​ సూట్​లో భోజనానికి ఒక్కరికి రూ.35 వేలు, బిజినెస్​ క్లాస్​లో ఒక్కరికి రూ.17 వేల నుంచి 5 వేల దాకా, ప్రీమియం ఎకానమీ క్లాసులో భోజనానికి రూ.3 వేలుగా నిర్ణయించి టికెట్లు అమ్మారు. లాక్​డౌన్​తో చిక్కుకుపోయిన వాళ్లు టికెట్ల కోసం ఎగబడడం మామూలే కదా అనుకుంటున్నారా.. కానీ ఈ ఫ్లైట్​ఏ దేశానికీ వెళ్లట్లేదు. ఆ మాటకొస్తే పార్కింగ్​ నుంచి ఇంచ్​ కూడా కదలదు. అయినా కంపెనీ టికెట్లు అమ్మింది, జనం ఎగబడి మరీ కొనుక్కున్నరు. మరీ టికెట్​ దేనికి అంటే.. విమానంలో భోజనం చేయడానికట. పార్కింగ్​లో ఉన్న ఏ380 జంబో జెట్ ను సింగపూర్​ ఎయిర్​లైన్స్ టెంపరరీ హోటల్​గా మార్చింది. టికెట్​కొనుక్కుని వచ్చినోళ్లను ఎయిర్​హోస్టెస్​లు విమానంలోకి తీసుకెళ్లి, సీట్లో కూర్చోబెట్టి మెనూ ప్రకారం భోజనం పెడ్తరు. విమానం కదలన్నట్టేగానీ మిగతా మర్యాదలన్నీ అచ్చంగా ప్రయాణికులను చూసుకున్నట్లే చూసుకుంటరట. ఈ టికెట్​ కొనుక్కుంటే ఎంచక్కా విమానంలో ప్రయాణం చేసిన ఫీలింగ్​ వస్తదని జనాలు కూడా బుక్​ చేసుకున్నరు. ఫ్లైట్లను పార్కింగ్​లో పెడితే పార్కింగ్​ ఫీజు కింద రోజుకింత అని చెల్లించాలి. అందుకే సింగపూర్​ ఎయిర్​లైన్స్​ ఈ ఆలోచన చేసింది.