మరికల్లో చిరుత దాడిలో లేగదూడ మృతి

మరికల్లో చిరుత దాడిలో లేగదూడ మృతి

మరికల్, వెలుగు :  నారాయణపేట జిల్లా మరికల్​ మండలంలోని పూసల్​పహడ్​ అనుబంధ గ్రామం సంజీవకొండ వద్ద చిరుతపులి దాడిచేసి ఓ లేగదూడను చంపేసింది. రైతు పాలెం రఘు తన పొలం వద్ద లేగదూడను కట్టేయగా బుధవారం అర్ధరాత్రి చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. 

గురువారం పశువుల పాక వద్దకు వెళ్లిన రఘు భయాందోళనకు గురై ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపాడు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతపులి నుంచి తమను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.