
యాదాద్రి, వెలుగు : వాగు దాటుతూ నీటిలో చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు రక్షించిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. బీబీనగర్ మండలం రావిపహాడ్ తండా, భువనగిరి మండలం అనాజీపురం మధ్యలోని చిన్నేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
లోలెవల్ బ్రిడ్జిపై నుంచి దాటేందుకు బీబీనగర్మండలం మాధారం గ్రామానికి చెందిన వెల్వర్తి మహేశ్శుక్రవారం ప్రయత్నించారు. ఆ సమయంలో వరద ఉధృతి మరింత పెరగడంతో జారి పడిపోయాడు. అయితే బ్రిడ్జికి ఉన్న పిల్లర్ను గట్టిగా పట్టుకుని కేకలు వేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా జేసీబీ తో వెళ్లారు. లోలెవల్ బ్రిడ్జి మధ్యకు వెళ్లి మహేశ్ను పైకిలాగి రక్షించారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు.