తాళం వేసిన ఇంట్లో భారీ దొంగతనం : ఎస్ఐ గణేశ్​

తాళం వేసిన ఇంట్లో భారీ దొంగతనం : ఎస్ఐ గణేశ్​

డిచ్​పల్లి, వెలుగు : డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​లో శనివారం వేకువజామున భారీ దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంట్లో నుంచి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. డిచ్​పల్లి ఎస్ఐ గణేశ్​తెలిపిన వివరాల ప్రకారం ఘన్​పూర్​ గ్రామానికి చెందిన ఆజాద్​ఇటీవల గల్ఫ్​నుంచి వచ్చాడు. ఇంటికి తాళం వేసి, కొన్ని రోజుల కింద ఫ్యామిలీ తో కలిసి కరీంనగర్​లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. దుండగులు ఇంటి తాళం పగలగొట్టి రూ.10 లక్షల నగదు, 7 తులాల గోల్డ్, వెండి ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ​గణేశ్​​ చెప్పారు.

కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లాకేంద్రంలోని గాంధీ గంజ్​ఏరియాలో ఉన్న శ్రీరాఘవేంద్ర ట్రేడర్స్​లో శనివారం తెల్లవారు జామున  దొంగలు చోరీకి యత్నించారు. ఉదయం షాప్​తెరవడానికి వచ్చిన ఓనర్​శశి, షెటర్ ​తెరిచే ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. టౌన్​సీఐ నరేశ్, క్లూస్​టీమ్​ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చి, చోరీకి ప్రయత్నాలు చేసినట్లు పుటేజీలో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. షెటర్ ధ్వంసం చేసే టైంలో అటువైపు వేరే వ్యక్తులు రావడంతో పారిపోయినట్లు   తెలిపారు.