వరంగల్ : పేదరిక నిర్మూలనలో విద్య ప్రముఖ పాత్ర పోషిస్తుందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇందుకోసం విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం నూతన విద్య విధానం తీసుకువచ్చిందన్నారు.
2030 నాటికి అంతటా...
ఈ విధానాన్ని తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. 2030 నాటికి అంతటా ఈ విద్యా విధానాన్ని అమలు చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. హర్యానాలో 2025 నాటికి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.