పబ్లిక్ క్లబ్‌‌లో అక్రమాలపై విచారణ జరపాలి : నూకల సుదర్శన్ రెడ్డి

పబ్లిక్ క్లబ్‌‌లో అక్రమాలపై విచారణ జరపాలి : నూకల సుదర్శన్ రెడ్డి

సూర్యాపేట , వెలుగు :  సూర్యాపేట పబ్లిక్ క్లబ్‌‌లో అక్రమాలపై విచారణ జరపాలని సీనియర్ సభ్యులు నూకల సుదర్శన్ రెడ్డి, బొల్లెద్దు దశరథ, బైరు శైలేందర్ గౌడ్ కోరారు. గురువారం ఆర్డీవో వీరబ్రహ్మ చారికి వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి నెలా దుకాణాలు ఆడిటోరియం అద్దెల ద్వారా లక్షల రూపాయల ఆదాయం వస్తున్న క్లబ్‌‌లో కార్యదర్శి, ట్రెజరర్‌‌‌‌ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.  నిధులను స్వాహా చేయడమే కాదు క్లబ్ కు సంబంధం లేని రంగస్థల పద్యాలు, భరత నాట్యాలు నిర్వహించారని మండిపడ్డారు.

12 నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం పెట్టాలని, ప్రతి నెలా క్లబ్ యొక్క ఆదాయ, వ్యయాలు సభ్యులకు తెలియజేస్తూ నోటిస్ బోర్డులో పెట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని,  డబ్బులు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో ఎల్గూరి చంటిబాబు,శనగాని రాంబాబు గౌడ్, చెంచల శ్రీనివాస్పబ్లిక్ క్లబ్‌‌లో అక్రమాలపై విచారణ జరపాలి

కక్కిరేణి శ్రీనివాస్, పొలగాని బాలు గౌడ్, పిండిగ విజయ్ కుమార్, ఎండీ ఫరీదోద్దీన్, పోలెబోయిన నర్సయ్య, దోరేపల్లి రమేశ్, కర్నాటి రవి, గవ్వ కృష్ణ రెడ్డి,  లింగయ్య,  శేఖర్,  ఖమ్రుద్దీన్, శ్రీనివాస్ గౌడ్, శేషయ్య,  రాంబాబు, సాయినేత,  రఘు, సైదులు, ఎల్గూరి రవి,  నవీన్ కుమార్ పాల్గొన్నారు.