గోదావరిఖని, వెలుగు: రామగుండం పట్టణంలో శిథిలమైన జెన్కో క్వార్టర్స్లో ఉన్న మెయిన్ పోస్టాఫీస్ను కొత్త బిల్డింగ్లోకి మార్చేందుకు చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే యూజర్స్ కమిటీ మెంబర్అనుమాస శ్రీనివాస్కోరారు.
ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. చాలా ఏళ్ల క్రితం పోస్టాఫీస్ను జెన్కో క్వార్టర్స్లో ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం అది పూర్తిగా శిథిలమైందని, పైకప్పు ఎప్పుడు కూలుతుందోనని ఉద్యోగులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. లీడర్లు తూండ్ల శ్రీనివాస్, మాచర్ల వినోద్, మడక జేమ్స్, దండుగుల రమేశ్
ఉన్నారు.
