![ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్ : ఐదుగురు మృతి](https://static.v6velugu.com/uploads/2024/04/a-reactor-exploded-in-an-industry-in-sangareddy-three-workers-passed-away_q3hFUO6CgA.jpg)
ఫ్యాక్టరీలో మొదట ఒక రియాక్టర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మేనేజర్ రవితోపాటు మరో నలుగురు కార్మికులు చనిపోయినట్లు నిర్ధారించారు. పేలుడు ధాటికి డైరెక్టర్ రవి, సుబ్రమణ్యం, సురేష్ , పాల్,దామోదర్ స్పాట్ లోనే చనిపోయారు. దాదాపు 10మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. నాలుగు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు ఫైర్ సిబ్బంది. రియాక్టర్ పేలుడుతో సమీపంలోని మూడు భవనాలు కుప్పకూలాయి. ఈ శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు ఉండొచ్చని సహాయక చర్యలు చేపట్టారు.