ఐదో తరగతి స్టూడెంట్​ను.. ఫస్ట్​ ఫ్లోర్ నుంచి విసిరేసిన టీచర్​

ఐదో తరగతి స్టూడెంట్​ను.. ఫస్ట్​ ఫ్లోర్ నుంచి విసిరేసిన టీచర్​

    ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​లో ఘటన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ టీచర్​ ఐదో తరగతి స్టూడెంట్​ను స్కూల్​ బిల్డింగ్​ఫస్ట్​ ఫ్లోర్​ నుంచి కిందికి విసిరేసింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను సమీపంలోని హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం ఆ స్టూడెంట్ కోలుకుంటోంది. సెంట్రల్     ​ఢిల్లీలోని మోడల్​ బస్తీలో గల ప్రాత్మిక్​ విద్యాలయంలో గీతా దేశ్వాల్​అనే టీచర్​ఈ దారుణానికి పాల్పడింది.  టీచర్ ​ముందుగా ఆ స్టూడెంట్​పై కత్తెరతో దాడిచేసింది.

అనంతరం ఆమెను ఫస్ట్​ ఫ్లోర్​ నుంచి కిందికి విసిరేసింది. దీంతో స్టూడెంట్​కు గాయాలయ్యాయి. బిల్డింగ్​పైనుంచి కింద పడిన స్టూడెంట్​ను చూసి పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. వెంటనే ఆ స్టూడెంట్​ను సమీపంలోని హిందూరావు హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని అధికారులు తెలిపారు. అన్నిరకాల మెడికల్​ టెస్టులు నిర్వహించి, అవసరమైన ట్రీట్​మెంట్​ అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

టీచర్​ సస్పెన్షన్​

విషయం తెలిసి స్కూల్​కు వచ్చిన పోలీసులు..  టీచర్​ను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్​మెంట్​ ఆధారంగా టీచర్​పై అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డిప్యూటీ పోలీస్​ కమిషనర్​ తెలిపారు. స్టూడెంట్​ను స్కూల్ ​బిల్డింగ్ ​ఫస్ట్​ ఫ్లోర్​ నుంచి విసిరేసిన టీచర్ గీతా దేశ్వాల్​ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సస్పెండ్ ​చేశారు.