ఆగస్టు 30న మహారాష్ట్రకు మంత్రి హరీశ్ రావు

ఆగస్టు 30న మహారాష్ట్రకు మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు : మంత్రి హరీశ్​రావు నేతృత్వంలోని బీఆర్ఎస్​ప్రతినిధుల బృందం బుధవారం మహారాష్ట్రలో పర్యటించనుంది. షోలాపూర్​లో పద్మశాలీల ఆరాధ్య దైవం మార్కండేయ రథోత్సవంలో హరీశ్​రావు సహా బీఆర్ఎస్​నాయకులు పాల్గొననున్నారు. ఆయన వెంట హోం మంత్రి మహమూద్​అలీ, ఎమ్మెల్సీ ఎల్. రమణ, బీఆర్ఎస్​మహారాష్ట్ర ఇన్​చార్జి కల్వకుంట్ల వంశీధర్​రావు తదితరులు వెళ్తున్నారు. మార్కండేయ రథోత్సవంలో పాల్గొన్న అనంతరం షోలాపూర్​లో బీఆర్ఎస్​నిర్వహించే భారీ బహిరంగ సభ కోసం స్థలాన్ని పరిశీలించనున్నారు.