ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో ఓ దొంగ రెచ్చిపోయాడు. లోని ప్రాంతంలో పట్టపగలే దారి దోపిడీకి పాల్పడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళను గన్తో బెదిరించి బంగారు గొలుసు లాక్కున్నాడు. అక్కడే ఉన్న ఓ యువకుడు అడ్డురావడంతో అతన్ని కూడా బెదిరించి సెల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించి దృశ్యాలు ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై డీఎస్పీ రజనీష్ కుమార్ ఉపాధ్యాయ స్పందించారు. కేసు నమోదు చేసి, విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.