గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో ఆదివారం అర్ధరాత్రి ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రాళ్ల లోడ్తో వెళ్తున్న టిప్పర్.. విప్రో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మూడు కార్లు, రెండు బైకులను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా వేరే రూట్లో వెళ్తున్న మరో టిప్పర్ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ స్పాట్లో నే చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. షేక్ నజీర్ హుస్సేన్ (30) భా ర్య, ఇద్దరు పిల్లలతో కలిసి నాంపల్లిలో ఉంటున్నా డు. 8నెలలుగా స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 11.50 గంటలకు పిజ్జా డెలివరీ చేసేందుకు హుస్సేన్, గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వైపు వచ్చాడు. విప్రో జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడ డంతో ఆగాడు.
మరికొన్ని బైకులు, మూడు కార్లు ఆగి ఉన్నాయి. అదే టైంలో ఖానామేట్ నుంచి వట్టినాగులపల్లి క్రషర్ పాయింట్కు రాళ్ల లోడ్ తీసుకువెళ్లే టిప్పర్.. ఐఐఐటీ నుండి విప్రో జంక్షన్ వైపు వేగంగా దూసుకొచ్చింది. రెడ్ సిగ్నల్ ఉన్నా.. మూడు కార్లు, బైక్లను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా.. క్యూసిటీ నుంచి నానక్రాంగూడ వైపు వెళ్తున్న మరో టిప్పిర్ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ హుస్సేన్ స్పాట్లోనే చనిపోయాడు.
పలువురికి గాయాలు
గచ్చిబౌలిలో సినిమా చూసి హాస్టల్కు వెళ్తు న్న ఎంజీఐటీ కాలేజీలో బీటెక్ మూడో సంవత్స రం చదువుతున్న రజాక్ కుడి కాలు విరిగింది. నానాక్రాంగూడలో ఫ్రెండ్ను బైక్పై డ్రాప్ చేసేందుకు వెళ్తున్న యూసఫ్గూడకు చెందిన స్విగ్గీ ఎంప్లాయ్ సురేంద్ర దాస్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన టిప్పర్ సూపర్వైజర్ కలీం కాలు విరిగింది. కార్లలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
టిప్పర్ డ్రైవర్ షేక్ ఖాసీం (38) బీహార్ నుంచి మూడు రోజుల కిందే హైదరాబాద్ వచ్చాడు. రూట్ తెలియకపోవడంతో సూపర్వైజర్ కలీంతో కలిసి ఖానామేట్ నుంచి వట్టినాగులపల్లికి ఓవర్ స్పీడ్తో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఖాసీంను అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు కార్లు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి.