గణేష్ నిమజ్జనం ఊరేగింపులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

గణేష్ నిమజ్జనం ఊరేగింపులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో యువతీ, యువకులు డీజే సంగీతానికి డ్యాన్స్ లు చేస్తున్నారు. ఇంతలో అక్కడే ఉన్న ఓ ట్రాక్టర్ వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో డ్యాన్స్ చేస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మురాద్‌నగర్ పట్టణంలో మంగళవారం (సెప్టెంబర్ 26) సాయంత్రం జరిగింది. 

ట్రాక్టర్ వేగంగా రావడం వల్ల ముందు ఉన్న కొంతమందిని ఢీకొట్టుకుంటూ వెళ్లి.. ఓ కారును కూడా ఢీకొంది. ఆ తర్వాత అక్కడే ఆగిపోయింది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో బైక్ లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బాధితుల ఫ్రెండ్స్ వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పై కోపంతో దాడి చేశారు. ట్రాక్టర్ పై ఉన్న మరికొంతమంది యువకులపైనా దాడి చేశారు. 

Also Read : గంజాయి పుష్పాలు : రూ.3 కోట్ల విలువైన.. 14 వందల కేజీల గంజాయి పట్టివేత

డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని.. పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.