ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో యువతీ, యువకులు డీజే సంగీతానికి డ్యాన్స్ లు చేస్తున్నారు. ఇంతలో అక్కడే ఉన్న ఓ ట్రాక్టర్ వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో డ్యాన్స్ చేస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మురాద్నగర్ పట్టణంలో మంగళవారం (సెప్టెంబర్ 26) సాయంత్రం జరిగింది.
ట్రాక్టర్ వేగంగా రావడం వల్ల ముందు ఉన్న కొంతమందిని ఢీకొట్టుకుంటూ వెళ్లి.. ఓ కారును కూడా ఢీకొంది. ఆ తర్వాత అక్కడే ఆగిపోయింది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో బైక్ లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బాధితుల ఫ్రెండ్స్ వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పై కోపంతో దాడి చేశారు. ట్రాక్టర్ పై ఉన్న మరికొంతమంది యువకులపైనా దాడి చేశారు.
Also Read : గంజాయి పుష్పాలు : రూ.3 కోట్ల విలువైన.. 14 వందల కేజీల గంజాయి పట్టివేత
డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని.. పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
गाजियाबाद
— Shakti Singh/शक्ति सिंह (@singhshakti1982) September 27, 2023
गणपति विसर्जन के दौरान हुआ हादसा।
सड़क पर तेज रफ्तार अनियंत्रित ट्रेक्टर ने बाइक को मारी टक्कर।
ट्रेक्टर ने बाइक को कुछ दूरी तक घसीटा।
बाइक सवार ने कूदकर बचाई अपनी जान।
गुस्साई भीड़ ने ट्रेक्टर सवारों की जमकर की पिटाई
वीडियो हुआ वायरल@Uppolice @dgpup @myogiadityanath pic.twitter.com/g1UnKP3Yaq