మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళి

మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళి

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్​, వెలుగు :  రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు అనుదీప్​ దూరిశెట్టి, జితేశ్​వి పాటిల్​ అన్నారు. మంగళవారం మౌలానా అబుల్​కలాం ఆజాద్​ జయంతి సందర్భంగా ఆయా కలెక్టరేట్​లో ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత నెహ్రూ నాయకత్వంలోని తొలి  క్యాబినెట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని  వివరించారు. 

మౌలానా ఆజాద్​ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. దేశంలో విద్యాభివృద్ధికి పునాధులు వేసిన మహానీయుడు ఆజాద్​ అని కొనియాడారు.   ఖమ్మంలో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ శ్రీజ, కొత్తగూడెంలో అడిషనల్​ కలెక్టర్​ డి. వేణుగోపాల్, జిల్లా మైనార్టీ ఆఫీసర్​సంజీవరావు, బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​ విజయలక్ష్మి పాల్గొన్నారు.