ముగ్గురు పిల్లలతో కలిసి.. తల్లి ఆత్మహత్య

ముగ్గురు పిల్లలతో కలిసి.. తల్లి ఆత్మహత్య

ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూన్​ 30న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ అర్బన్​ మండలం రుద్రవరానికి చెందిన రజిత కరీంనగర్​లోని సుభాష్​నగర్​కి చెందిన మహ్మద్​ అలీతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో భర్తకు తన పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి పిల్లలతో కలిసి బయల్దేరింది. 

ఆమె అప్పటి నుంచి కనిపించకపోవడంతో బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  ఈ క్రమంలో బోయినపల్లి మండలం కొదురుపాక మిడ్​మానెరు వంతెన వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె తన పిల్లలు ఉస్మాన్​ అహ్మద్(14), అయ్యన్​(7), అశ్రజాబిన్​(1) కలిసి మిడ్​మానెరులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాలు వెలికి తీసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.