
హైదరాబాద్: తెలంగాణ టీటీ ప్లేయర్ ఆకుల శ్రీజ.. 50వ ఇంటర్ ఇనిస్టిట్యూషనల్ టోర్నీలో గోల్డ్ మెడల్తో మెరిసింది. ఆర్బీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీజ మంగళవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 4–0 (11–6, 11–7, 13–11, 11–5)తో మౌమితా దుట్టాపై గెలిచింది. సెమీస్లో 4–2 (16–14, 11–6, 11–6, 4–11, 7–11, 11–8)తో తన కొలీగ్ దియా చిటాలేను ఓడించింది. ఏఏఐకి ఆడుతున్న ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ బ్రాంజ్ మెడల్ను సాధించాడు. సెమీస్లో స్నేహిత్ 2–4తో మనుష్ షా చేతిలో ఓడి మూడో ప్లేస్కు పరిమితమయ్యాడు. ఆంచట శరత్ కమల్ 4–2తో మనుష్ షాపై నెగ్గి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. టీమ్ ఈవెంట్లో స్నేహిత్, శ్రీజ సిల్వర్ మెడల్స్ను గెలుచుకున్నారు.