
బషీర్ బాగ్, వెలుగు: ఓ కేసులో నిందితుడిని తప్పించేందుకు రూ.లక్షన్నర లంచం డిమాండ్చేసిన షాయినాయత్గంజ్మాజీ ఇన్స్పెక్టర్బాలు చౌహాన్ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్చేశారు. గత నెల 7న(డిసెంబర్) షాయినాయత్గంజ్ పీఎస్లో నమోదైన కేసులో ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు ఇన్స్పెక్టర్ బాలు చౌహాన్ రూ.1.5 లక్షలు డిమాండ్ చేశాడు. సదరు వ్యక్తి రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. తర్వాత లంచం డిమాండ్చేసిన విషయాన్ని ఆధారాలతో సహా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
విషయం తెలుసుకున్న బాలు చౌహాన్ లాంగ్ లీవ్ పెట్టి వెళ్లాడు. ఈ నెల 3న హైదరాబాద్ సీపీ ఇన్స్పెక్టర్బాలుచౌహాన్ను షాయినాయత్గంజ్పీఎస్నుంచి బదిలీ చేశాడు. శుక్రవారం సిటీకి వచ్చిన అతన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఏసీబీ స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచి, రిమాండ్ కు తరలించారు.