
- కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ అధికారుల పిటిషన్
హైదరాబాద్, వెలుగు: గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరాంను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా పనిచేసిన ఆయనను అక్రమాస్తుల కేసులో శనివారం అర్ధరాత్రి ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ రెయిడ్స్లో ఆయన ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారని తేలింది. రూ.300 కోట్లకు పైగా విలువైన వ్యవసాయ భూములు, ఫాంహౌస్, కార్లు, ప్లాట్లు, ఫ్లాట్లు ఉన్నట్టు తేలడంతో ఏసీబీ అతన్ని అరెస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలోనే బుధవారం హరిరాంను సస్పెండ్ చేస్తున్నట్టు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన సస్పెన్షన్తో ఖాళీ అయిన స్థానంలో సీఈ పీవీఏ ప్రసాద్ను నియమించారు. ఆయనకు గజ్వేల్ఈఎన్సీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈఎన్సీ హరిరాంను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడంతో బినామీ ఆస్తులను గుర్తించేందుకు 5 రోజులు కస్టడీకి అడిగారు. ఆ కస్టడీ పిటిషన్పై కోర్టులో విచారణ జరుగుతోంది.