లంచం అడిగాడు.. ఏసీబీకి చిక్కాడు.. మహబూబ్ నగర్ జిల్లా భూత్భూర్ ఆర్ఐ నిర్వాకం

 లంచం అడిగాడు.. ఏసీబీకి చిక్కాడు.. మహబూబ్ నగర్ జిల్లా భూత్భూర్ ఆర్ఐ నిర్వాకం

పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్  జిల్లా భూత్పూర్  రెవెన్యూ ఇన్స్​పెక్టర్​ బాల సుబ్రహ్మణ్యం రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. కల్యాణలక్ష్మి మంజూరు కోసం మండలానికి చెందిన ఒక వ్యక్తి నుంచి ఆర్ఐ డబ్బులు డిమాండ్  చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో బాధితుడు రూ.4 వేలు ఇవ్వగా, ఆర్ఐను ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. తహసీల్దార్​ ఆఫీస్​లో విచారణ చేస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.