న్యూఢిల్లీ: అదానీ గ్రూప్లోని సిమెంట్ కంపెనీ ఏసీసీ లిమిటెడ్ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 2023 క్వార్టర్లో ఏసీసీ లిమిటెడ్ రూ. 388 కోట్ల లాభం సంపాదించింది. అమ్మకాలు పెరగడం, కిల్న్ ఫ్యూయెల్ రేట్లు తగ్గుముఖం పట్టడం, ప్రీమియం ప్రొడక్టులకు గిరాకీ పెరగడం వంటి కారణాలతో లాభాల బాటలోకి ఏసీసీ వచ్చింది. అంతకు ముందు ఏడాది క్యూ2 లో కంపెనీ రూ. 87 కోట్ల నష్టం పొందింది.
సెప్టెంబర్2023 క్వార్టర్లో రెవెన్యూ 11.22 శాతం పెరిగి రూ. 4,434.73 కోట్లకు పెరిగినట్లు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది. సిమెంట్, క్లింకర్ సేల్స్ వాల్యూమ్ 17.4 శాతం గ్రోత్తో 8.1 మిలియన్ టన్నులకు చేరినట్లు పేర్కొంది. తాజా క్వార్టర్లో కిల్న్ ఫ్యూయెల్ ఖర్చు 42 శాతం తగ్గినట్లు ఏసీసీ లిమిటెడ్ వెల్లడించింది.
డిమాండ్ మెరుగ్గానే ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో సిమెంట్ ఇండస్ట్రీ పనితీరు ఆశాజనకంగానే ఉంటుందని ఏసీసీ హోల్టైమ్ డైరెక్టర్ అజయ్ కపూర్ చెప్పారు. గురువారం ట్రేడింగ్లో ఏసీసీ షేర్లు 0.92 శాతం పెరిగి రూ. 1,907.80 వద్ద క్లోజయ్యాయి.